Skip to main content

మూడు వ్యవసాయ చట్టాలు రద్దు - Repeal of three agricultural laws | Polity Information for Jobs

 మూడు వ్యవసాయ చట్టాలు రద్దు

మూడు వ్యవసాయ చట్టాలు రద్దు - Repeal of three agricultural laws

అత్యంత వివాదాస్పదమైన మూడు నూతు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది . సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 19 న జాతినుద్దేశించి ఉద్దేశించి ప్రసంగిస్తూ ... 2020 సెప్టెంబర్లో తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు . దేశంలోని చిన్న , సన్నకారు రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించేందుకు సంపూర్ణ సదుద్దేశంతో ఈ చట్టాలను తీసుకొచ్చామని , అయినప్పటికీ కొందరు రైతులను ఒప్పించలేకపోయామని ఆయన పేర్కొన్నారు . 2021 నవంబర్ 29 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబందించిన రాజ్యాంగబద్ధ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు . వ్యవసాయ చట్టాలపై దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు .

మూడు వ్యవసాయ చట్టాల వివరాలు 1 రైతు ఉత్పత్తుల వాణిజ్య , వ్యాపార ( ప్రోత్సాహక , సులభతర ) చట్టం 2020 : వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ ( ఏపీఎంసీ ) మార్కెట్లకు వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను ( దేశంలో ఎక్కడైనా సరే ) అమ్ముకునేందుకు ఇది స్వేచ్ఛనిస్తుంది . అలా చేసే విక్రయాలపై రుసుములేవీ విధించకూడదని స్పష్టం చేస్తోంది . 
2 ధరల హామీ , వ్యవసాయ సేవలపై రైతుల ( సాధికారత , రక్షణ ) ఒప్పంద చట్టం -2020 : పండించబోయే పంట కొనుగోలుకు సంబంధించి వ్యాపార సంస్థలు , ప్రాసెసర్లు , ఎగుమతిదారులతో రైతులు ముందుగానే ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది . పంట ధరను వారు ముందుగానే నిర్ణయించుకోవచ్చు . 3 నిత్యావసర సరకుల ( సవరణ చట్టం ) - 2020 : తృణధాన్యాలు , పప్పులు , నూనెగింజలు , ఉల్లి , బంగాళదుంప వంటి ఉత్పత్తులను నిత్యావసర సరకుల జాబితా నుంచి తొలగించాలని .. వాటి ఎగుమతులపై నిల్వ పరిమితి సంబంధిత ఆంక్షలు విధించకూడదని ఇది సూచిస్తోంది . యుద్ధం , కరవు , ప్రకృతి విపత్తులు , ధరల్లో అసాధారణ పెరుగుదల వంటివి తలెత్తినప్పుడే ఆ ఆంక్షలు విధించాలని పేర్కొంటోంది . చట్టాల రద్దు కోసం ఏడాదిపాటు రైతుల పోరాటం వ్యవసాయ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టేందుకు తీసుకొచ్చిన ఈ మూడు వివాదాస్పద చట్టాలను 2020 జూన్లో ఆర్డినెన్స్లను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది . ఆర్డినెన్స్ల స్థానే తీసుకువచ్చిన బిల్లులు సెప్టెంబర్ పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాక చట్టాలుగా మారాయి . కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు 2020 సెప్టెంబర్ 27 న రాష్ట్రపతి ఆమోదం లభించింది . వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020 నవంబర్ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో . రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు . దేశంలోని సుమారు 500 రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ) పేరిట ఒకే గొడుగు కిందకు వచ్చాయి . బాష్పవాయు గోళాలు , నీటి ఫిరంగులు , లాఠీచార్జీలు , 2021 జనవరి 26 న జరిగిన హింసాకాండ , విచ్చలవిడి అరెస్టులు , రైతు నేతలపై , ప్రముఖ పాత్రికేయులపై ఎఫ్ఎఆర్లు , పర్యావరణ కార్యకర్తల అరెస్టులు వంటి పలు రకాల అణచివేతలను రైతులు ఎదుర్కొన్నారు . 90 రోజులపాటు లక్షల మంది రైతులు ఢిల్లీని ముట్టడించినా ఆ ముట్టడి ప్రశాంతంగా , ప్రజాస్వామ్యయుతంగా సాగింది . 
ఇప్పటివరకు ఈ పోరాటంలో 750 మందికిపైగా రైతులు అమరులయ్యారు .
వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతుల పోరాటం కొన్ని సందర్భాల్లో హింసాత్మకంగా మారింది . వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా 2021 జనవరి 26 న గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీకి రైతులు పిలుపునిచ్చారు . దానికోసం పోలీసుల నుంచి ముందుగానే అనుమతులు తీసుకున్నారు . కానీ శాంతియుతంగా జరగాల్సిన ఆ ర్యాలీ కాస్తా హింసాత్మకంగా మారింది . కొంతమంది నిరసనకారులు బారికేడ్లను తోసుకొని .. తమకు అనుమతి లేని రహదారుల్లోకి దూసుకెళ్లారు . ఫలితంగా పోలీసులు , నిరసనకారుల మధ్య ఘర్షణలు తలెత్తాయి . ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు . వందల మంది గాయపడ్డారు . క్షతగాత్రుల్లో పోలీసులు ఉన్నారు . ట్రాక్టర్ బోల్తాపడటంతో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు . నిరసనకారుల్లో కొందరు ఎర్రకోటలోకి ప్రవేశించి .. దానిపై మతపరమైన జెండా ఎగరేయడం కలకలం సృష్టించింది . 2021 అక్టోబర్ 3 న ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ భేరీలో శాంతియుతంగా

Gets Latest Governament Recruitments Click Here 

Comments

Popular posts from this blog

Information and analysis of ancestral traits | పూర్వీకుల లక్షణాల సమాచారం మరియు విశ్లేషణ

 Information and analysis of ancestral traits ( పూర్వీకుల లక్షణాల సమాచారం మరియు విశ్లేషణలు) మీరు .. మీ నాన్న గారు .. మీ తాత గారు .. ముత్తాత గారు .ఇక్కడి  దాకా ఓకే  కానీ....... ఇంకా ముందున్న పూర్వీకులు గురించి మీకు తెలుసా ? పోనీ మీకు ఎంత మంది పూర్వీకులు వున్నారో తెలుసా? భూమి పై మనిషి పుట్టి నలబై లక్షల సంవత్సరాలు అయ్యింది . వందేళ్లకు మూడు తరాలు. అంటే మీకు ఒక కోటి ఇరవై లక్షల మంది  పూర్వీకులు వున్నారు .. ముత్తాత కు నాన్న .. ముత్తాత కు తాత .. ముత్తాతకు ముత్తాత .. ఇలా వెనక్కు వెళితే మొత్తం కోటి ఇరవై లక్షల తరాల చరిత్ర మీది .. నాది .. మనందరిది .  మనిషి అయిదు వేల సంవత్సరాల క్రితం దాక అడవిలోనే నివసించాడు . అంటే మీ పూర్వీకుల్లో  ఒక కోటి పందొమ్మిది లక్షల ఎనబై అయిదు వేల మంది బతికింది అడవుల్లోనే. చివరి పదహైదు వేల  తరాల వారు మాత్రమే గుడిసెలు వేసుకొని స్థిరనివాసం ఏర్పరచుకొని గ్రామాల్లో బతికారు .      అడవి లో  జీవనం అంటే చెట్లు చేమలు .. జంతువుల తో  సావాసం .. ఆ మాటకు వస్తే గుడిసెల్లో గ్రామీణ జీవనం కూడా ప్రకృతి లో జీవించడమే కదా?  . చెట్...

How did autumn begin? | శరదృతువు ఎలా ప్రారంభమైంది ? | Latest Jobs Articles

 శరదృతువు ఎలా ప్రారంభమైంది ? ( How did autumn begin? ) రాజహంసలు పొందిన క్రౌంచపర్వత బిలము గలదై , వరిచేను మరియు గడ్డి సమూహముల పుట్టుకకు కారణము గలదై , యాజ్ఞికులచే చేయబడిన హోమ హవిస్సుతో కూడిన అగ్ని కలిగినదై బాగా ప్రకాశించెడి లక్షీదేవి చేరిన కమలముగలదై మెలకువతో ఉన్న ఆది శేషునిపై పడుకున్న శ్రీమహా విష్ణువు సేవ కొఱకే అన్నట్లుగా వికసించిన ఎఱ్ఱ కలువలతో నిండిన సరస్సుగలదై శరధృతువు ప్రారంభమైనది.  శరదృతువులో ప్రకృతి ఎలా కన్పడింది ? ( What did nature look like in the fall?) శరదృతువులోని మేఘాలు ఎలా ఉన్నాయి ? - శరత్కాలమనెడి స్త్రీ ఈ భూమికి ( దేవలోకం వలె ) అమృత సమానత్వాన్ని చేకూర్చుటకై, వర్షాకాలపు మబ్బులు వీడిన తర్వాత ఎక్కువగా కాసె ఎండును ; వికసించిన తెల్లతామరల, ఎర్రకలువల యొక్క పుప్పొడిని చెఱువులలోని అలలపై కలుగజేస్తూ అచటి నీటి కాలుష్యాన్ని పోగొట్టుచున్నదా ?  అన్నట్లు అందాన్ని చూకూరుస్తుందని కవి వర్ణిస్తాడు . How are the autumn clouds?        The woman of autumn dries up most of the case after the monsoon clouds have parted, in order to add ambrosial equali...

Brihadeeswarar Temple History in Telugu | GK | Telugu Jobs Article's

 Brihadeeswarar Temple History in Telugu బృహదీశ్వర టెంప్ల్ ఇ ( పెరువుడైయార్ కోవిల్ ) భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. దీనిని పెరియ కోవిల్, రాజరాజేశ్వర ఆలయం మరియు రాజరాజేశ్వరం అని కూడా పిలుస్తారు . ఇది భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి మరియు చోళుల కాలంలో ద్రావిడ శిల్పకళకు ఉదాహరణ . చక్రవర్తి రాజ రాజ చోళ I చేత నిర్మించబడింది మరియు 1010 AD లో పూర్తయింది , ఈ ఆలయం 2010 లో 1000 సంవత్సరాల పురాతనమైనది . ఈ ఆలయం "గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలు" అని పిలువబడే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో భాగం , మిగిలిన రెండుబృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం మరియు ఐరావతేశ్వర ఆలయం .  ఈ ఆలయం 16వ శతాబ్దంలో జోడించబడిన కోట గోడల మధ్య ఉంది. విమానం (ఆలయ గోపురం) 216 అడుగుల (66 మీ) ఎత్తు మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ఆలయం యొక్క కుంభం (పైభాగం లేదా గుబ్బల నిర్మాణం) ఒకే రాతితో చెక్కబడింది మరియు సుమారు 80 టన్నుల బరువు ఉంటుంది . ప్రవేశ ద్వారం వద్ద 16 అడుగుల (4.9 మీ) పొడవు మరియు 13 అడుగుల (4.0 మీ) ఎత్తు ఉన్న ఒకే రాతితో చెక్కబడిన నంది (పవిత్రమైన ఎద్దు) ...